24, అక్టోబర్ 2013, గురువారం

విజయనగర రాజులు బలిజ కులస్తులే అన్న 1901 మద్రాస్ సెన్సస్ రెపోర్ట్

            విజయనగర రాజులు బలిజ కులస్తులే అని  లో బ్రీటీషు వారు తమ మద్రాస్ సెన్సస్ రెపోర్ట్ లో 1901 లోనే రాశారు దానికి ఆధారాలు కూడా చూపెట్టారు. బలిజ కులం గురించి, బలిజకులస్తులము అనే చెప్పుకునే కులాలగురించి కూడా చెప్పారు. తమ కులం గురించి తామే మర్చిపోయిన అనేక విషయాలను ఎప్పుడొ ఇందులో పొందుపరిచారు. శెట్టిసమయం (శెట్టిసమ్మే) గురించి దానిలోని కులాల గురించి కూడా ఈ రెపొర్ట్ లో సంక్షిప్తంగా తెలిపారు. ఇన్ని ఆధారాలు చూపినా ఇంకా శ్రికృష్ణదేవరాయలు తమవాడే అని చెప్పుకోవడానికి కొన్ని కులాలు ఇంకా తాపత్రయ పడడం ఆశ్చ్యర్యం కలిగిస్తోంది. భారతదేశం గురించి ప్రపంచం లోని చాలా దేశాలకు తెలిసినంత కూడా భారతీయులకు తెలియదు. అంతగా చరిత్రను విజ్ఞానాన్ని నాశనం చేశారు. అది బయటి సంస్కృతుల పని  పని. దేశ సంస్కృతిని కాపాడి ఉన్నతమైన నాగరికతలను అభివృద్ధి చేసిన, భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలలకు చేర్చిన ఒకే ఒక జాతి బలిజ జాతి. ఒక చేత రాజ్యపాలన మరోచేత వ్యాపారం, గ్రామాలలో న్యాయాధిపతులైన శెట్టి లేదా దేశాయి లు ప్రపంచ న్యాయశాస్త్ర సూత్రాలకు పునాదులు వేశారు. ఇంతగా తమ భూమిని ప్రేమించి, పాలించి, సంపదలను సృష్టించిన బలిజల చరిత్ర వారికే తెలియనంతగా భూస్థాపితం అయింది.  వాటిని తవ్వి తీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నడుం కట్టారు. చాలామంది ఇప్పటికే వారి వారి పరిశోధనలను గ్రంధస్తం చేశారు. ఈ పుస్తకాలు త్వరలోనే ప్రజల ముందుకు రానున్నాయి. వారి వారి గ్రంధాలలోని కొన్ని భాగాలనే నేను ఈ బ్లాగ్ లొ పోస్ట్ చేస్తున్నాను. చరిత్ర పునర్నిర్మాణానికి అంకితమైన ఆ మహానుభావులందరికీ భగవంతుడు అయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 














                 

23, అక్టోబర్ 2013, బుధవారం

కాకతీయ రాజులు బలిజ వంశీయులే

        కాకతీయులు చోళవంశానికి చెందిన రాజులు. మున్నూరు సీమ(కృష్ణా జిల్లా) ప్రాంతీయులైన జాయప్పసేనాని సోదరీమణులు నారమ్మ,పేరమ్మ లను కాకతీయ గణపతిదేవుడు వివాహమాడాదు.(చేబ్రోలు శాసనము) వారి కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన నిడదవోలు (తూర్పు గోదావరి జిల్లా) గణపతిదేవరాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి కుమార్తె జ్ఞానాంబను ధరణికోట రాజు కోట పెద్దిరాజుకిచ్చి వివాహం చేశారు. వారి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.       


       కాకతీయ రాజులలో రుద్రమదేవి తరువాత ఆమె కుమార్తె జ్ఞానాంబ కుమారుడు  కాకతీయ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.  తాను కాపు వంశీయుడుగానే చెప్పుకున్నాడు. "దుర్వాసాదేవిపురాణం" లో చెప్పబడిన ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.  

శ్లో:  ప్రతాపరుద్రనామ్నాతు యధారాజ మహీతలే!
     ఉదృవిప్యతి ధర్మాత్మా క్షత్రధర్మ పరాయణ !!
     భిబ్రాజచ్ఛల  మర్తి గండ్కులో రుద్రావతార:
     ప్రభు కాప్యేషాం కులమున్నతి
     తరాం రాజిష్యతిక్షా శ్రీ వీరాభ్యుదయాశ్రియా 
     పరమయా దేదీప్యమానస్వయంతలే 
     సర్వా ్ పూర్వాము దాహృతా ్ జనపదానాక్రమ్యరాజివ్వతి 

21, అక్టోబర్ 2013, సోమవారం

దక్షిణ భారత దేశాన్నేలిన నాయక రాజులు బలిజ కులస్తులే


              విశ్వనాథనాయకునికి మధురై(పాండ్య) రాజ్యాన్ని అచ్యుతదేవరాయలు రాసి ఇచ్చిన శాసనమే కొటికం వారి కైఫీయతు ఇందులో విశ్వనాథనాయకుని కులం ఇంటిపేరును స్పష్టంగా  కనబరిచారు. విశ్వనాథ నాయకుని తండ్రి తంజాఊరును రక్షించడానికి వెళ్ళి శతృవులను పారద్రోలిన తరువాత స్వతంత్రించుకుంటాడు. రాయల కుటుంబానికి బంధువులైనందున అచ్యుతరాయలను ధిక్కరిస్తాడు. మీ తండ్రి మీరు అందరూ రాజ్యాలు చేయాలి మేము మీ దగ్గర ఊడిగం ఛెయాలా అంటూ ధిక్కరిస్తాడు. నాగమనాయకుడిని  బంధించి ఎవరు తీసుకు వస్తారు అంటే అంత సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు నాగమనాయకుని కుమారుడు విశ్వనాథనాయకుడు ముందుకు వస్తాడు. తండ్రిపై దండెత్తుతాడు అక్రమంగా సంపాదించిన రాజ్యం తనకు వద్దని తండ్రిని తెచ్చి అచ్యుతరాయలుకు అప్పచెబుతాడు. దానికి మెచ్చిన   అచ్యుతరాయలు నువ్వు అడిగి వుంటే రాజ్యాన్ని ఈచ్చే వాడిని అంటూ నాగమనాయకుడిని మందలించి విశ్వనాథ నాయకుడిని పాండ్య రాజ్యానికి విజయనగరం లోనే పట్టభిషేకం చేసి ఆ సందర్భం లో రాసి ఇచ్చిన అనుభవ హక్కు పత్రమే కొటికం వారి కైఫీయత్ . 



కొటికం వారి కైఫీయత్


     శ్రీ మన్మహామండలేశ్వరులైన రాజాధిరాజ రాజ పరమేశ్వరులైన శ్రి మహారాజ రాజశ్రీ శ్రీ ఘననగర విద్యాకరపట్నం సంస్థానకర్త అయిన  రాజ మహారాజశ్రి అచ్యుతదేవ మహారాయలయ్య వారు పృథినీ సామ్రాజ్యం చేయుచుండు వ్యాళ, చెల్లే శాలివాహనశకం ౧౪౫౫  (1455) మీద సం|| వైశాఖ శుద్ద ౧౫ (15) గురువారం శ్రవణా నక్షత్రం శుభయోగ శుభకరణమందు వారి బొక్కసం మొదలయిన సమస్త మనోవర్తి కార్యములు కొటికం నాగమనాయణ్కు  అఖిలండకోటి బ్రహ్మాండనాయకులైన శ్రీ రంగనాయకుల స్వామివారు స్వప్న లబ్దాంచిత, గంగాస్నానమున్నూ, మరకత విశ్వనాథ స్వామి లింగమున్నూ, విస్వనాథస్వామినాయుడు అనే పుత్ర సంతానమున్నూ  పొందియున్న యెడల శ్రీ మద్రాజాధిరాజ రాజపరమేశ్వరులైన మహారాజశ్రీ విశ్వనాథనాయనయ్య గారు ఒకనాటికొకనాడు స్వామి కటాక్షం చేత, విద్యలయందున్నూ సాధనయందున్ను, బుద్ధివిశేషం వ్యాపించి అన్నట మహాసామర్థ్యం కల్గియుండిన యెడల శ్రీ మన్మహామండలేశ్వరులయిన రాయదేవలవారి కార్యభాగములయందు కొనసాగేటట్టు నడతలు గలవారై, అంగ,వంగ కళింగాది దేశముల దిగ్విజయము చేసియున్న యెడలనున్ను, వొకానొక దినమందు  సమస్థాన కార్య ఉద్ధారణ చేసినందున అచ్యుతదేవమహాదేవలయ్యవారు అమరనాయక పట్టవర్ధన భూమిపాలన సంస్థాన కర్తవ్యముగా పాండ్య, చేర, చోళ, మళయాళ మండలాధిపత్యానికి చేరిన మామూలు అష్టదిక్కులున్నూ యేర్పరచి తూర్పు సముద్రం, మన్నారుకోట ఆగ్నేయం,అనంతశయనం, దక్షిణం గూడల్లూరు, నైరుత్యం పెద్దేరు కోయమ్ముత్తూరు వాళయూరు పడమర ఘట్టం కన్మ, ఉత్తరం వాలికొండ శ్వేతనది, ఈశాన్యం తంజనగరం సరిహద్దులు కావేర్యాంతం. ఈ మధ్యమ మందులోనుగా గల ఉభయ కావేరి, రామసేతు, ధనుష్కోటి,తామ్రపర్ణీ, చిత్రానదీ, క్షీరనదీ,కృతమలా, వేగావతీ, నిక్షేపనదీ, వరాహనదీ,సురభీనదీ,ఉత్తర శ్వేతనదీ, అమావతీ, సాలిగ్రామనదీ, రత్ననదీ, భవానినది మొదలయిన పుణ్యనదులున్నూ, శ్రీరంగం తోతాద్రి మధురై అళగిరి మొదలయిన విష్ణుస్థళాళుంకూడ్ని జంబుకేశ్వర మధుర చొక్కనాథ మీనాక్షి మొదలైన శివస్థలాలు కూడ్ని, గిరిదుర్గ, వనదుర్గ, స్థళదుర్గ, జలదుర్గ, శ్రీ త్రిశిరగిరి మధురాపురి పట్న సాలకలు మొదలయ్ని కూడ్ని రాజ్యములు చేర్నినాడు, పల్లెలూ గ్రామాలూ, వూళ్ళూ ప్యాటలు, కోటలు, స్థలనగరములతో నుంగూడ్ని రాష్ట్రముల్కు ఆస్తానమయిన మధురాపురి పట్నానకు చేర్ని దేవబ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శుద్రులు అష్టాదశ వర్న, పంచమ వర్ణక సహశ్రీజలతో నుంగూడ్ని రాష్ట్రం యావత్తూ కల్గిన యీ మధుర నగరానుకు, నీవే రాజువనిన్నీ, రాజ సప్తాంగముతో నున్నూ సభా సప్తాంగముతో నున్నూ కూడుకొని సభాసప్తాంగముల యిప్పించి శ్రీ మన్మహామండలేశ్వర అచ్యుతదేవ మహారాయలయ్యవారు దైవప్రాసాదలబ్దవశాత్ చాతను కరుణతోగూడి బలిజవర్న గెరికపాటి వంశమున కల్గిన శ్రీ విశ్వనాథ నాయనయ్య గారికి పాండ్యమండలాధీరాజు అనే ౨౪ (24) రెండున్న కోటి ద్రవ్యరాజ్యానికి శాస్త్రోక్తముగా పట్టభిషేకం విజయనగరమందు చేయించిరి. మరిన్ని భూవరహాది అనేకం. బిరుదున్నూ అనేక వాద్యాలున్నూ తమ కులదేవత అయిన దుర్గ లక్ష్మీ అమ్మవార్లున్నూ యిష్టదేవత అయిన, లక్ష్మీనారాయణస్వామి స్వర్ణ విగ్రహమున్ను దయచేసి, చతురంగ సేనలును మంత్రి సామ్రాజకులున్నూ, యిప్పించినందున విస్వనాథ నాయని వారు మరిన్నీ అనేకం బ్రహ్మలను రప్పించుకొ ప్రయాణం అంపించుకొని ఇచ్చటికి వచ్చి మధురాపుర పట్నంలో నగళ్ళు కల్గజేసి అచ్చట వునికి పట్టభిషిక్తుడై రాజ్యం శాసించి, శ్రీరంగం, జంబుకేశ్వరం మొదలైన మహాస్తళాలకు అధిక పుఛ్రయంగా వుత్సవాలు  మొదలయినవి. నడిపించుకొని తీరావాసములయందు అనేక అగ్రహారాదుల నిర్మించి వనాధుల ఛేదించి దుష్టనిగ్రహాది శిష్ట పరిపాలనము చేస్తూ మనునీతి ప్రకారం కార్యఖడ్గములుకి యోగ్యముగా ప్రజలను పరిపాలనము చేస్తూ వంశాభివృద్ధిగా ప్రభుత్వం చేయుదురు.  

18, అక్టోబర్ 2013, శుక్రవారం

సూర్యవంశ క్షత్రియులు బలిజ వంశీయులే - శాసనాధారము

    
    
    సూర్య, చంద్ర వంశాలు రెండూ బలిజ కులస్తులే వీటికి శాసనాధారాలు చాలా వున్నాయి. వాటిలో ద్రాక్షరామ శాసన సంపుటి నుండి లభించిన ఒక శాసనాన్ని గమనించండి.

1. స్వస్తి సమస్త ద్విజగురు దేవతా భక్తి మా(గక్) తత్సరులుం బ్రహ్మణ క్షత్రియ వైశ్య చాతువన్ ణా ్ శ్రమదమ్మ           ప్రతిపాలితా

2. (నేక)హయ గజాంబర స్వణ ్ ధనధాన్యసమృద్దులుం, అనద్వాహార ధారూధులు దండాయుధ హస్తులు -               నిజాభరణులుం విజయ

3.---ముని విశ్వకమ ్ తోటకాచయ్య ్ ప్రవీణులుం, అజాతశతౄలుం సంజాత మిత్రులుం వితరణ గుణ                    మంధాత్రులుం ని  

4.(భిలజన) మిత్రులుం బ్రణమతఫల ప్రారంభసూత్రులుం శ్రీ మనుమకుల పవిత్రులుం స్వస్తి సమస్త భువనజస           విఖ్యాత పంచాశత 

5. --- గుగుణాల ప్రతసత్యశో (చా) ర చారిత్ర సమలినయ విపుల విజ్ఞాన వీరబలంజమన్ ప్రతిపాలన విప్రద్ద                   గరుఢధ్వజ విరాజిత

1.అందరికీ శుభం కలుగు గాక సమస్త ద్విజులు, గురువుల పట్ల భక్తి కలిగిన వారిలో మొదటివారము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చాతుర్వర్ణాశ్రమ ధర్మ పాలితులము.
2. అనేక ఆశ్వాలు , ఏనుగులు, బంగారం, ధనం, ధాన్యం సమృద్ధిగా కలిగిన వారము, ఏకొరతా లేని వారము, నిరంతరం దండమును(ఆయుధము) చేత ధరించి వుండేవారము, నిజము మాట్లాడడాన్ని ఆభరణంగా కలిగిన వారము, విజయులము.
3. మనువు, మయుడు, విశ్వకర్మ, తోటక ఛందస్సులో ప్రవీణుడైన ఆచార్యుడు (శంకరాచార్యుడు) అంతటి నైపుణ్యం కలిగిన వారము, ఎవరిపట్లా శతృత్వం వహించని వారము, దాన గుణం కలిగిన వారము.
4. అందరికీ మిత్రులము, బ్రణమత (శబ్ధము చేసే మతము)బ్రాహ్మణ మత ప్రారంభ ఫలాన్ని అందించిన వారము, పవిత్రమైన 'మనువు' కులములో జన్మించిన వారము. సమస్త భూమండలం లో ఖ్యాతి నార్జించిన 500 వీరశాసనాలు కలిగిన వారము.
5. సర్వ గుణాలలో సత్యము శ్రేష్టమైనది అలాంటి సత్యవ్రతాన్ని ఆచారముగా ధీరత్వముతో ఆచరిస్తున్న అధికులము, విజ్ఞానులము, వీరబలింజ సమయధర్మ పరిపాలకులము, గరుడధ్వజ విరాజితులము


        ఇందులో మనుమ కులము అనగా మనువు జన్మించిన కులము అని అర్థము. అంటే సూర్యవంశం  అని అర్ధం. ఆ కాలం లో ఈ బిరుదాలను సామాన్యులు ధరిస్తే  కఠినంగా శిక్షించేవారు .