25, డిసెంబర్ 2013, బుధవారం

శ్రీకృష్ణదేవరాయలు యదువంశీయుడే కాదు



      శ్రీకృష్ణదేవరాయలు యదు వంశీయుడు కాదు యదువు తమ్ముడు తుర్వసుని వంశీయుడు. పారిజాతాపహరణం పీఠికలో నందితిమ్మన చాలా స్పష్టంగా చెప్పాడు. యదువంశీయులకు రాజ్యార్హత లేదని కూడా స్పష్టం చేశాడు. అప్పటి కాలం లో శ్రీ రాయల వారిని సాక్షాత్తూ అ శ్రీకృష్ణుడే శ్రీ కృష్ణదేవరాయలుగా జన్మించాడని అనుకునేవారట. కృతిపతి వంశావళి అంటూ ఆయన కృష్ణుడితో తులానాత్మక వర్ణన చేస్తూ రాశారు. ఈ పద్యాలను సరిగా అర్థం చేసుకోలేని యాదవులని చెప్పుకునే గొల్ల సోదరులు రాయలు గొల్ల కులస్తుడని పొరపాటు పడ్డారు. కొంతమంది కుహనా మేధావులు కేవలం ఒక పద్యం చూపించి రాయలు గొల్ల కులస్తుడే అంటే నమ్మి అనవసరంగా తమది కాని చరిత్రను తమదిగా పొరపాటున చెప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చరిత్ర వాస్తవం అది నిప్పు లాంటిది, అబద్దాల దుప్పటి దానిపై కప్పి మాయ చేయాలని చూస్తే ఆ దుప్పటిని కాల్చుకుని బయటకు వస్తుంది. వాస్తవంగా పారిజాతాపహరణం లో ఏముందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం వుంది. పారిజాతాపహరణం పీటిక కాపీలను ఇక్కడ పెడుతున్నాను గమనించ గలరు. యదువు సంతతి వారిని మాత్రమే యాదవులు అంటారు. తుర్వసుని సంతతి వారిని కాదు. కురు సంతతి వారిని కౌరవులు అంటారు. వీరంతా బంధువులు చంద్రవంశ క్షత్రియులు. వీరు వున్నత కులానికి చెందిన వారే కానీ దిగువ స్థాయి కులాలకు చెందిన వారు కాదు. పారిజాతాపహరణం లో శ్రీరాయల వారి మెప్పుకోలు కొరకు ముక్కుతిమ్మనార్యుడు శ్రికృష్ణుడికి దక్కని అనేక అర్హతలను రాయలవారు అందుకున్నారని 17 వ పద్యం లో చమత్కరించారు. ఈ పద్యాల క్రింద అర్థాన్ని తాత్పర్యాన్ని కూడ గమనించగలరు.

సేకరణ: పోలిశెట్టి సత్తిరాయుడు గారు, హైదరాబాదు