15, జులై 2014, మంగళవారం

రాయల వంశం గురించి పెనుగొండలక్ష్మి గ్రంధం లో శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఏమని రాశారు.



      పుట్టపర్తి వారు రాయల వారి రాజగురువు శ్రీ తాతాచార్యుల వారి వంశీకులు. వీరి ఇంట్లో విజయనగర సామ్రాజ్యం గురించి దాని వైభవం గురించి తరతరాలుగా మాట్లాడుకునే వారు. శ్రీ నారాయణాచార్యుల వారి గురించి ప్రపంచానికి చెప్పడానికి నా అర్హత చాలదని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఎవరెస్ట్ శిఖరం గురించి ఒక చీమ వర్ణించగలుగుతుందా....నా పరిస్థితి అదే... 


      ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
                                                -సి. నారాయణ రెడ్డి

          ప్రతివ్యక్తీ తనదైన చరిత్రను తెలుసుకోవడానికి ఉత్సాహపడతాడు. తనచరిత్ర గొప్పదైతే దానిని తలచుకొని గర్వపడతాడు. దాని స్పూర్తితో భవిష్యత్తును మలచుకోవడానికి తాపత్రయపడతాడు. 

       శ్రీ పుట్టపర్తి వారి వంశం కూడా విజయనగర సామ్రాజ్యం లో అంతర్భాగమే. అందుకే పెనుగొండ కోట, పాడుబడిన అంతఃపుర మహళ్ళు చూసినప్పుడు ఆయన హృదయం ఉప్పొంగేది. ఆ వినాశనాన్ని తలచుకొని ఆయన కళ్ళు అశృధారలను స్రవించేవి. 

       ఎందుకు ఆచార్యుల వారు అంతగా స్పందించేవారంటే... ఆ ప్రాంతం రాయల వంశీకుల  గౌరవాన్ని పొందిన పుట్టపర్తి వంశీకులు నడయాడిన ప్రాంతాలు కావడం వల్లనే.

        పుట్టపర్తి నారాయణాచార్యులు 14 భాషలలో అనర్గళంగా కవిత్వం చెప్పగల దిట్ట మాత్రమే అని చాలమంది అనుకుంటుంటారు. 

ఆయన కవిత్వంలో ఎంతటి శిఖరమో చరిత్ర పరిశోధనలో అంతకంటే ఉద్ధండుడని చాలమందికి తెలుసు. 

శ్రి రాయల వారి ఇంటిపేరు సంపెట వారని మొట్టమొదట ప్రకటించిన వారు శ్రీ ఆచార్యుల వారే.  

        ఆయన 12 సంవత్సరాల వయసులో అద్భుతంగా రాసిన పద్య కావ్యం పెనుగొండలక్ష్మి. ఈ గ్రంధం చివరన మా పెనుగొండ అంటూ పెనుగొండ చరిత్రను, ప్రాంతాలను ఆయన వర్ణించారు. ఆ క్రమం లోనే శ్రీ ఆచార్యుల వారు రాయల వంశాన్ని గురించి 37వ పేజీలో చెప్పారు. 

గమనించండి


పుట్టపర్తి వారు స్వదస్తూరి తో రాసిన పత్రము